విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. రోజురోజుకూ సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్, మెయిల్స్, వాట్సప్ మెసేజ్లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు.