ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశం అయ్యామని, కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన వైసీపీదే విజయమని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు సంఖ్యా బలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న అంతర్యాం అర్థం కావడం లేదన్నారు. ఎవ్వరు ఎవరి కోసం గేట్లు తెరిచారో 2019 ఏన్నికల్లొ చుసామన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన వైసీపీకి విజయం ఖాయమన్నారు. బోత్స సత్యనారాయణ స్థానికేతరుడు అంటే మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడి వారని కురసాల కన్నబాబు ప్రశ్నించారు.