ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు మృతితో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 11:12 PM

విజయనగరం జిల్లా, రామభద్రపురం మండల పరిధిలోని ముచ్చర్లవలస గ్రామంలో రెండు వారాల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నడగాన రవణ(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు నడగాన సురేష్‌(24) గతనెల 24న ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దీంతో మనస్తాపం చెందిన తండ్రి రమణ గ్రామంలోని పొలంలో బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అపస్మారక స్థితికి చేరు కున్న రమణను స్థానికులు బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com