న్యూఢిల్లి : సిబిఐ డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరపడానికి మరొక న్యాయమూర్తి నిరాకరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ కేసు విచారణనుంచి తప్పుకున్నారు. నాగేశ్వరరావు తన రాష్ట్రానికే చెందిన వారని, ఆయన కుమార్తె వివాహానికి తాను వెళ్లానని జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎకె సిక్రి ఈ కేసు విచారణనుంచి తప్పుకున్నారు.