మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. కోర్చి తాలుకా డోంగార్ గావ్లో రెండు జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఇంతటితో ఆగకుండా మావోయిస్టులు చెట్లను నరికి పలుచోట్ల రహదారికి అడ్డంగా వేశారు. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల దుశ్చర్యతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.