ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటో ఢీకొని వృద్దుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:18 PM

శ్రీకాకుళం నగరంలోని అరసవిల్లి ఆదిత్యనగర్‌ కాలనీ సమీపంలో బుధవారం రాత్రి ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కిష్టప్పపేట గ్రామానికి చెందిన పి.రామారావు తన ఆటో తో ఒప్పంగి నుంచి అరసవిల్లి మీదుగా శ్రీకాకుళం వస్తున్నాడు. అదే సమయంలో సెగిడివీధికి చెందిన బూరవిల్లి గణేష్‌(70) టిఫిన్‌ చేసేందుకు ఇంటి నుంచి బయట కు వచ్చాడు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చన ఆటో గణేష్‌ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన గణేష్‌ను అదే ఆటోలో రిమ్స్‌కు తరలించ, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గణేష్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడ ఉన్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com