ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తమ పాఠశాల అవార్డుకు ఎంపికైన కర్నూలు పాఠశాల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:15 PM

కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్మారక మున్సిపల్‌ కార్పొరేషన హై స్కూల్‌ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డుకు ఎంపికైంది. ఏప్రిల్‌ నెలలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు, ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పాఠశాలను ఎంపిక చేస్తూ ఆంధ్రప్రదేశ డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంటు ఎగ్జామినేషన డి. దేవానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల అవార్డును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మికి అందజేయనున్నారు. విజయవాడ మంగళగిరి ఏపీఎ్‌సపీ క్యాంపు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 10వ తేదీలోగా రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ పరీక్షల విభా గం డైరెక్టర్‌ ఆదేశించారు. 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో వరుసగా ఉత్తమ అవార్డుకు ఈ పాఠశాలగా ఎంపికైంది. మూడో సారి ఎంపిక కావడం హర్షణీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com