ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ సీఎం విజయన్‌ కు రూ.కోటి చెక్‌ అందజేసిన మెగాస్టార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 09:49 PM

కేరళ వయనాడ్‌ విపత్తుల్లో దాదాపు 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే.ఈ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విపత్తులో బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి, తనయుడు రామ్‌ చరణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి గురువారం ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లారు. సీఎం పినరయి విజయన్‌ను కలిశారు. రూ.కోటి విరాళం చెక్‌ను సీఎంకు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com