ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి ఎలక్షన్ కమిషన్‌లో సభ్యత్వం లేని పార్టీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:09 PM

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇంటింటికీ రూ.4 వేల పెన్షన్ ఇచ్చినందుకా..? పోలవరం పనులు మొదలు పెడుతున్నందుకా..? కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సహకారం తీసుకువచ్చినందుకా..? అని నిలదీశారు. జగన్ కోటల్లో ఉంటారు..ప్రజలు ఎలా ఉంటున్నారో తెలుసా ..? అని అడిగారు. జగన్ ప్రజల పక్షాన నిలబడాలి..ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలని అనడం సరికాదని అన్నారు. వైసీపీకి ఎలక్షన్ కమిషన్‌లో సభ్యత్వం లేని పార్టీ అని విమర్శించారు. ముందు జగన్ పార్టీని చక్కదిద్దుకోవాలని సూచించారు. వైసీపీ పార్టీ ఎవరిదో క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com