కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం జ్యోతి ని బుధవారం జనసేన జన బాట రాష్ట్ర ఇన్చార్జి పంతం నానాజీ కలిశారు. రూరల్ మండలం కోట్ల డబల్ ఎంట్రీ లపై చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో 500 ఓట్లకు పైగా డబ్బులు ఎంట్రీలు ఉన్నాయని, స్థానిక జనసేన నాయకులు చేసిన విచారణలో బయటపడిందన్నారు. అధికారులు ఎవరికి భయపడకుండా నిష్పక్షపాతిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.