ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ చేత అసత్యాలు పలికించారు : వైసీపీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 03:19 PM

అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ చేత అబద్ధాలాడించారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ 40 పేజీల అబద్ధాల కరపత్రాన్ని గవర్నర్‌ చేత చదివించడం దురదృష్టకరమని అన్నారు. 55 శాతం వృద్ధి పెరిగినట్లు నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని చెప్పారు. తయారు, సేవా రంగాల్లో అసలు వృద్ధే లేదన్న శ్రీకాంత్‌రెడ్డి.. నవరత్నాల ను దొంగిలించి గవర్నర్ తో చదివించారని మండిపడ్డారు. 2014 మ్యానిఫెస్టో హామీల అమలును బాబు మరిచిపోయారని విమర్శించారు. ఐదళ్ల పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తీసుకుని ఎన్నికలకు వెళ్లకుండా.. శ్వేత పత్రాలు, కొత్త హామీలిస్తున్నారని విమర్శించారు. హంద్రీనీవా, గాలేరు పనులు వైఎస్సార్‌ హయాంలోనే జరిగాయన్న శ్రీకాంత్‌రెడ్డి.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారన్నారు. మోసం... మోసం... చంద్రబాబు నైజం అని విమర్శంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com