ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రీమెన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 02:54 PM

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ త్రీమెన్‌ కమిటీలో మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావుకు ప్రాతినిధ్యం లభించింది. ప్రస్తుత అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌చంద్రారెడ్డి, గోపీనాథ్‌లతో కూడిన కమిటీ సభ్యులంతా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆదివారం విజయవాడలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్రీమెన్‌ కమిటీని అసోసియేషన్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో విజయనగరం నుంచి సుజయ్‌కృష్ణ రంగారావు, మాంచవ్‌(అనంతపురం), మురళి (గుంటూరు) లను ఎన్నుకున్నారు. అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగేంతవరకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీసీ) కార్యకలాపాలను ఈ త్రీమెన్‌ కమిటీ నిర్వహిస్తుందని సుజయ్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com