ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 02:55 PM

విజయనగరం జిల్లా, గరివిడిలోని ఈఎస్‌ఐ పెన్షనర్లు  ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఈఎస్‌ఐ పెన్షనర్ల సమస్య పరిష్కరించాలంటూ ఢిల్లీలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈఎస్‌ఐ పెన్షన్‌ రూ.9వేలకు పెంచాలని, బకాయి డీఏ చెల్లించాలని, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీకి వెళుతున్న వారిలో కార్మిక సంఘ నేతలు ఏ.గౌరునాయుడు, కంది రామారావు, మూర్తి, తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com