ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీ పై ఎవ్వరూ జాలిపడోద్దు : బుద్దా వెంకన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 04, 2024, 07:24 PM

ఎన్నికలకు ముందు రంకెలు వేసిన వైసీపీ నాయకులంతా ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. కొడాలినాని, పేర్నినాని, వల్లభనేని వంశీ, మరి కొందరు అధికారం ఉందనే అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని గుర్తు చేశారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాక వారి చిరునామా కనిపించడం లేదని సెటైర్లు వేశారు.వంశీ ఆనాడు చంద్రబాబు, లోకేశ్‌ను దూషించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారని పేర్కొన్నారు.టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక కుట్రలు చేశారని, వైఎస్ చనిపోతే వంశీ పార్టీ చేసుకున్నారని వెల్లడించారు. . అతను చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందేని అన్నారు.అతను ఎక్కడ కనిపించినా పోలీసులకు అప్పగించాలని ప్రజలను కోరారు.అతనిపై ఎవ్వరూ కూడా జాలిపడొద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com