ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుధ్య సమస్య ఉంటే, రోగాల భారిన పడినట్లే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:05 PM

పారిశుధ్యం లోపించిన ప్రాంతాల్లో జ్వరాలు వెలుగుచూస్తున్నాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలు, మేజర్‌ పంచాయతీల పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో కనీసం పారిశుధ్య పనులు చేయించేందుకు సైతం నిధులు లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పారిశుధ్యం క్షీణించి.. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. పారిశుధ్యం మెరుగుపరిచేలా దృష్టి సారించాలని కోరుతున్నారు. అలాగే జ్వరాల నివారణకు వైద్యఆరోగ్యశాఖ అధి కారులు చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com