శ్రీసత్య సాయి జిల్లా అమరాపురం మండలం కేంకెర గ్రామంలోకొన్ని రోజుల నుంచి ప్రజలు వాంతులు విరేచనాలతో పక్క రాష్ట్రాం ఆసుపత్రులకు పోతున్నారు. విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గురువారం ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే ఆరోగ్య సిబ్బందిని కెంకెరకు పంపించడం జరిగింది. కావున విషయం తెలుసుకున్న వెంటనే వైద్య అధికారులను పంపించినందుకు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.