ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో జులై 24న ధర్నా,,,వైసీపీ అధినేత జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 07:29 PM

ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్న వైఎస్ జగన్.. దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు.జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పారు. అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ ప్రకటించారు.


పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రషీద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఏపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏపీలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని.. ఈ విషయంపై ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.


వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా ఉంటామన్న వైఎస్ జగన్.. రషీద్ హత్య ఘటనపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. రాజకీయ కక్ష్యతోనే రషీద్ హత్య జరిగిందన్న జగన్.. వ్యక్తిగత కారణాలంటూ పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే పుంగనూరులో జరిగిన ఘటనలను సైతం వైఎస్ జగన్ ప్రస్తావించారు.


రషీద్‌ హత్యకేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. రషీద్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షలతోనే రషీద్‌ హత్య జరిగిందని.. అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే, ఎంపీల పైనా రాళ్లు వేశారని మీడియాకు వివరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. 300లకు పైగా హత్యాయత్నం ఘటనలు జరిగాయని.. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. వీటితోపాటుగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగిందన్న వైఎస్ జగన్.. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు.


ఈ పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీలోని పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో జులై 24న ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ .. అనంతరం మోదీని కలిసి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com