ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 05:41 PM

గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాకు పాల్పడిన దళారులను, ప్రోత్సహించిన అధికారులను విడిచి పెట్టేదే లేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ హెచ్చరించారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్‌ పాలనలో ఒక్క కార్మిక శాఖలోనే రూ.3 వేల కోట్లను దారి మళ్లించారు. ఈఎ్‌సఐ ఆస్పత్రులు అస్తవ్యస్తంగా మారాయి. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. అభివృద్ధి పేరుతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అయిన కాడికి వైసీపీ నేతలు కమీషన్లు దండుకున్నారు. కొన్ని పనుల్లో అంచనా వ్యయాలు రెండు నుంచి మూడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని విచారణ చేయిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com