ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీర ప్రాంత నిర్వహణపై ప్రణాళిక విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 02:54 PM

తీరప్రాంత సంరక్షణ, నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత ముప్పు నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని తన నివాసంలో పవన్‌ సమక్షంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌, ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తీరప్రాంత నిర్వహణపై అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. అలాగే ఎన్‌సీసీఆర్‌ నిపుణులు రూపొందించిన తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. తీరప్రాంతంలో కోత, కెరటాల శక్తిని తగ్గించడంతో పాటు వీటివల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com