హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న చీఫ్ జస్టిస్ అధికారిక నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిని ఆయన కలవడం ఇదే ప్రథమం. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో ఆగిపోయిన హైకోర్టు నూతన భవన నిర్మాణం, హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల పూర్తికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత హైకోర్టు భవనంలో ఇంకా అదనంగా కల్పించాల్సిన వసతులు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
![]() |
![]() |