ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరు మండల ప్రజల దాహార్తి తీరేదెన్నడు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 12:57 PM

మంచినీటి కోసం పర్చూరు మండల ప్రజలు అల్లాడుతున్నారు. పర్చూరులో దాహం కేకలు విన్పిస్తున్నాయి. మండలంలో ఎక్కడ చూసినా అడుగంటిన మంచినీటి చెరువులే దర్శనమిస్తున్నాయి. ఉన్న అరకొర నీరు కాస్త రంగుమారి కంపుకొడుతున్నాయి. నాగుపాలెం, పర్చూరు, ఉప్పుటూరు, దేవరపల్లి, కొల్లావారిపాలెం తదితర గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com