ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ జయంతి వేడుకలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 04:40 PM

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైయ‌స్‌ విజయమ్మ, వైయ‌స్‌ భారతి, పలువురు కుటుంబ సభ్యులు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com