ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందులలో జగన్ ప్రజా దర్బార్.. భారీగా తరలివచ్చిన జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 03:32 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. పులివెందులలో రెండో రోజు పర్యటిస్తున్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో సమావేశం అయ్యారు. పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం కల్పించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ రాకతో ప్రజలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించారు. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిశారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా లింగాల మండలం పెద్దకూడాలలో వైఎస్సార్‌సీపీ నేత కుటుంబాన్ని జగన్‌ పరామర్శించనున్నారు. సోమవారం.. ఇడుపులపాయలో వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో జగన్‌ పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com