అనంతపురం జిల్లాలో ఇటీవల మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కార్పస్ ఫండ్ కింద రూ లక్ష విలువ చేసే చెక్కును శనివారం అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి అందజేశారు. జిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుంకన్న ఈ ఏడాది మార్చి నెలలో మృతి చెందారు. కార్పస్ ఫండ్ కింద రూ లక్ష విలువ చేసే చెక్కును మృతుడి భార్య నాగలక్ష్మికి అదనపు ఎస్పీ అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.