ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 12:29 PM

నేడు అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని పొట్టన బెట్టుకుంది. పొద్దుటే వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో ఏమో కానీ ఓ కారుని ఢీకొట్టాడు. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ వాహనం ఎవరిది? ఏంటనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com