ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రవేశ పరీక్ష విధానంలో కేంద్రం అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 02:38 PM

జాతీయ పరీక్షా సంస్థలో (ఎన్.టి.ఏ. ఏ) తక్షణ సంస్కరణలు అవసరమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు సుమారు 2.4 కోట్ల మంది విద్యార్థులు "నీట్" ద్వారా పోటీ పడుతుండగా ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.ఏ)పై ఉంద‌న్నారు.   ఇటీవల జరిగిన “నీట్” ప్రవేశ పరీక్షలో అవకతవకలు, ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్ష కంటే ముందు బహిర్గతం అయ్యాయి ఇలాంటి ఆరోపణలతో ఆ ప్రవేశ పరీక్ష రద్దు చేయడం. అలాగే యూజీసీ-నెట్ పరీక్ష కూడా రద్దు కావడంతో పలు ఆందోళనలను రేకెత్తిస్తుంద‌న్నారు. ఈ పరిణామాలు సంవత్సరాల తరబడి ఈ ప్రవేశ పరీక్ష కోసం కఠినమైన అభ్యసనా, విలువైన సమయం, పెట్టుబడిగా పెట్టిన అసంఖ్యాక విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని అలాగే జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.) లోని వ్యవస్థాగత సమస్యలను హైలైట్ చేస్తుందని లోక్‌ సభ ద్వారా `తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా పదేపదే జరుగుతున్న వైఫల్యాల వలన ఏర్పడిన అనిశ్చితితో సురక్షితమైన , విశ్వసనీయమైన ప్రవేశ పరీక్ష విధానాన్ని అందించగల జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.) సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వైద్య విద్యను అభ్యసించాలి అనుకుంటున్నా ఆశావహుల విశ్వాసం కోల్పోకుండా నిరోధించడానికి, ప్రభుత్వం అత్యవసరంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గురుమూర్తి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com