ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరమ్మతులు దృష్ట్యా గుంటూరులో ఈనెల 3,4 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 05:45 PM

గుంటూరు నగరంలో ఈనెల 3,4 తేదీల్లో (బుధ, గురువారాలు) తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. నగరంలో మెరుగైన తాగునీటి సరఫరా జరిగేలా, ఎక్క డా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్‌ పంపింగ్‌ లైన్ల మీద గుర్తించిన లీకులకు యుద్ధప్రాతిపదికన మరమ్మ తులు చేయడం జరుగుతుందని కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ సంగం జాగర్లమూ డి హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుండి గుంటూరు నగరానికి తాగునీరు సరఫరా చేేస 685 ఎం.ఎం. డయా సీఐ పంపింగ్‌ మెయిన్‌ లైన్‌పై ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ వద్ద ఏర్పడిన లీకు వలన తాగునీరు వృథా అవుతోందని, లీకు మరమ్మతులను వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. లీకు మరమ్మతుల కోసం సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ పూర్తి గా నిలుపుదల చేయాలని, ఈ నెల 3వ తేదీ ఉద యం సరఫరా తదుపరి పనులు చేపట్టడానికి ఇంజినీరింగ్‌ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు. పైప్‌లైన్‌ మరమ్మతుల వలన బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం వరకు నగరంలోని నాజ్‌సెంటర్‌ రిజర్వాయర్‌ పరిధిలోని 5, 7 డివిజన్లలోని నాజ్‌ సెంటర్‌, గుంటూరువారితోట, పొత్తూరువారి తోట, గణేష్‌రావు పేట, కొత్తపేట, రాజాగారితోట, రామిరెడ్డితోట 1 నుండి 8 లైన్లు, గంటలమ్మ చెట్టు, చౌత్రా సెంటర్‌, పూల మార్కెట్‌, ఎల్బీనగర్‌, బాలాజీనగర్‌ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తామన్నారు. గురువారం సాయంత్రం నుండి తాగునీటి సరఫరా యథావిదిగా జరుగుతుందన్నారు. నగర ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com