ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థినులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 05:32 PM

పలు పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు విద్యార్థుల పాలిట ఇబ్బందికరంగా మారుతోంది. వారిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. కడప, ఖాజీపేట బాలికోన్నత పాఠశాలలో ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. బాలికలంతా తీవ్ర జ్వరం, గొంతునొప్పి, విరేచనాలతో విద్యార్థినులంతా బాధపడుతున్నారు. కొందరు విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించి అస్వస్థతకు కారణమేంటో కనుక్కున్నారు. స్కూల్లో కలుషిత నీరే అనారోగ్యానికి కారణమని అధికారులు తేల్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com