ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్షన్ డబ్బులు మాయం అంటూ ఉద్యోగి డ్రామా, నిజం కక్కించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 05:30 PM

పింఛన్ల  పంపిణీతో నిన్న(జూలై 1) రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనగా.. ప్రొద్దుటూరులో మాత్రం పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ డబ్బులు మాయంపై అసలు గుట్టును బయటపెట్టారు పోలీసులు. పెన్షన్ డబ్బులను ఎవరో దోచుకెళ్ళారంటూ సచివాలయం ఉద్యోగి చెప్పడం అంతా డ్రామానే అని ఖాకీలు తేల్చేశారు. పింఛనర్లకు పంపిణి చేయాల్సిన రూ.4 లక్షల డబ్బులను సచివాలయ ఉద్యోగి మురళిమోహన్ ఆన్‌లైన్ గేమ్‌లో పోగొట్టుకుని డ్రామా క్రియేట్ చేసినట్లు అసలు విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. అలాగే ఇంత తంతంగం నడిపిన సదరు ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com