ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో జరుగుతున్న హింసపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 02:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మేడా ర‌ఘునాథ్‌రెడ్డి డిమాండు చేశారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై  ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వైయ‌స్‌ఆర్‌సీపీ తరపున రఘునాథ్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల అనంతరం హింస పెచ్చరిల్లుతోందని, టీడీపీ శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నాయని వైయ‌స్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి అన్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్‌ చేసుకుని దాడులు చేస్తున్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ అభిమానులు, సానుభూతిపరులపై హింసకు  తెగబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం వై‌య‌స్‌జగన్‌ అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా వల్ల రాయితీలు, నిధులు ఏపీకి వస్తాయి. ఏపీలో మీడియా ఛానల్స్ ను అణిచి వేస్తున్నారు. వైయ‌స్ జగన్ హయాంలో  ఏపీ మారిటైమ్‌ రంగం చాలా అభివృద్ధి చెందింది. అనేక ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశార‌ని వివరించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com