ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మళ్లీ ఐపీఎస్‌ల బదిలీలు.. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 09:52 PM

ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. అధికార యంత్రాంగం మీద దృష్టి సారించింది. గంజాయి, డ్రగ్స్, అవినీతి అంశాల మీద దృష్టిసారించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా అధికారులను నియమిస్తోంది.ఈ క్రమంలోనే మరోసారి ఏపీలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్‌ను ఏసీబీ డీజీగా నియమించింది. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్‌ను మార్చింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్‌ను సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ చేసిన ప్రభుత్వం, శాంతిభద్రతల అడిషనల్ డీజీ శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇప్పటికే పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్చారు. వైఎస్ జగన్ హయాంలో సీఎం పేషీలో కీలకంగా వ్యవహరించిన అధికారులను బదిలీలు చేశారు. తాజాగా ఈ ముగ్గురు అధికారులను బదిలీ చేసింది. మరోవైపు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సహా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం రిలీవ్ చేసింది. జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, అరుణ్ కుమార్, వెంకటరమణారెడ్డిలను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలోనే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


మరోవైపు శుక్రవారం ఉదయమే జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి, జీఏడీలో జీపీఎం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగ పూనం మాలకొండయ్యకి పోస్టింగ్ ఇచ్చింది. సాయంత్రానికి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com