ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం.. రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 08:15 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను మళ్లీ మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.. ఈ మేరకు సీఆర్డీఏకు కొత్త కమిషనర్‌ను నియమించింది. తాజాగా అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌, ఎండీగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీ పార్థసారథి నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ గురువారం‌ ఉత్తర్వులు జారీ చేశారు.


లక్ష్మీ పార్థసారథి 2014- 2019 మధ్య కాలంలో (టీడీపీ ప్రభుత్వ హయాంలో) ఏడీసీ సీఎండీగా వ్యవహరించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ సహా అమరావతి అభివృద్ధిపై ఆమెకు అవగాహన ఉండటంతో ఆమెను అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌, ఎండీగా నియమించారు. అమరావతి నిర్మాణంలో లక్ష్మీ పార్థసారథి సేవల్ని వినియోగించుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com