ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల సంఘం గుడ్న్యూస్ చెప్పింది. ఒక నెల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని ఆదేశించింది.. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల విధులు నిర్వహించిన డీఈవోలు, ఆర్వోలు, ఏఆర్వో, ఎన్నికల సిబ్బందికి (ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయిస్తారు) ఒక నెల బేసిక్ శాలరీకి తక్కువ కాకుండా.. అందుకు సమానంగా చెల్లిస్తారు. సీఏపీఎఫ్ గెజిటెడ్ ఆఫీసర్లు (కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, మెడికల్ ఆఫీసర్, అందుకు సమానమైన ర్యాంకులు ఉన్నవాళ్లకు 15 రోజులు లేదా అంతకంటే తక్కువైనా రూ.2,500 చెల్లిస్తారు.. 15 రోజులకంటే ఎక్కువ అయితే వారానికి రూ.1250 ఇస్తారు.
సీఏపీఎఫ్ సబార్డినేట్ ఆఫీసర్లు (ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, సమానమైన ర్యాకులు ఉన్నవాళ్లు) అయిన వాళ్లకు 15 రోజులు అంతకంటే తక్కువ అయితే రూ.2వేలు ఇస్తారు.. అదే 15 రోజులకంటే ఎక్కువైతే వారానికి రూ.వెయ్యి అందజేస్తారు. సీఏపీఎఫ్ మిగిలిన ర్యాంక్ అధికారుల (హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, సమాన ర్యాంక్ అధికారులు)కు 15 రోజులు, అంతకంటే తక్కువ అయితే రూ.1500, అదే 15 రోజుల కంటే ఎక్కువైతే వారానికి రూ.750 ఇస్తారు. అసిస్టెంట్ ఎక్స్పిండెచర్ అబ్జర్వర్/సెక్షన్ ఆఫీసర్/సెక్టార్ పోలీస్ ఆఫీసర్కు ఫుల్ టైమ్ ఎఎన్నికల డ్యూటీ చేస్తే రూ.7,500 ఫిక్స్ చేశారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగులు, ఇతర సిబ్బందికి సెలవు కూడా ఇచ్చారు. మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి) ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ విధులు నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో), మిగిలిన పోలింగ్ సిబ్బందికి ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నేల జీతం బోనస్గా ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఆయా సంఘాల నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి విన్నవించారు. టీఏ, డీఏల అంశాన్ని కూడా ప్రస్తావించారు.. టీఏ, డీఏలతో పాటుగా ఈ నెల జీతం అదనంగా ఇష్తున్నారు. దీంతో ఉద్యోగులకు భారీగా ప్రయోజనం కలగనుంది.. ఏపీ ఎన్నికల్లో ఒకటి, రెండు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. అలాగే కౌంంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది.
![]() |
![]() |