ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. అక్కడ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటూ ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.. మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు. అంతకుముందు గవర్నర్కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు..మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ను సత్కరించారు.
మరోవైపు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. గవర్నర్ ఆలయ మర్యాదలతో అధికారులు, పండితులు స్వాగతం పలికారు.. అనంతరం రాధాకృష్ణన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
![]() |
![]() |