హైవే పక్కనే పాఠశాలను నిర్మిస్తే విద్యార్థులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడు మండలంలోని రుద్రవరం గ్రామంలో నేషనల్ హైవే పనుల్లో భాగంగా ప్రాధమిక పాఠశాలను కూల్చివేశారు. మిగిలిన కొంతమేర స్థలంలో రెండు అంతస్థులు నిర్మించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు చేస్తుందని, అయితే హైవే పక్కన పాఠశాల నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. పాఠశాలకు అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మహేశ్వరరెడ్డి, హరినాథ్రెడి,్డ గోవిందు, సురేశ్, శంకర్స్వామి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |