వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాపు మహేష్రెడ్డి, కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఘటనలను పరిగణలోకి తీసుకుని వెంటనే కేసులు నమోదు చేసి, కారకులను వెంటనే అరెస్టుచేయాలని, దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డీజీపీని కోరారు. మేరకు డీజీపీకి వారు బహిరంగ లేఖ రాశారు. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండు చేశారు.
![]() |
![]() |