పలాస నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క సెంటు లేదా అంగుళం అయినా తాను భూమి ఆక్రమించుకున్నానని నిరూపించాలని అప్పలరాజు సవాల్ విసిరారు. 2017లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, 2019 వరకు తనపై 5 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయించారన్నారు. కానీ తాను 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ పలాసలో ప్రతిపక్ష నేతలపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 15 రోజులు గడవక ముందే మరో ఎఫ్ఐఆర్ తనపై నమోదు చేశారన్నారు. రానున్న ఐదేళ్లలో తనపై ఇంకా ఎన్ని ఎఫ్ఐఆర్ లు వేస్తారో అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన కంటే కక్షలు, కార్పణ్యాలపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా తాను సిద్ధంగా ఉన్నానని, 2029 ఎన్నికలే లక్ష్యంగా పని మొదలు పెడతామన్నారు.
![]() |
![]() |