నంద్యాలలోని బాలికల సమీకృత వసతి గృహం, పలు హాస్టళ్లను జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. వార్డన్లతో మాట్లాడారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన నాణ్యతను పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ.. వసతి గృహాల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటూ తమ దృష్టికి తీసుకురావాలని, వార్డన్లు విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా విద్యార్థుల అభ్యన్నతికి పాటు పడాలని సూచించారు.