ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి విధ్వంసకారుడని వైయస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, కాసు మహేష్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడమేంటి?. ఇటువంటి దాడులకు భయపడేది లేదని పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్.. అంటూ దుయ్యబట్టారు. ఫేక్ న్యూస్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు.