ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 06:59 PM

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మోది చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే అఖిల ప్రియకు శ్రీదేవి సన్నిహితురాలు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అఖిల ప్రియకు మద్దతుగా భార్యభర్తలు ప్రచారం చేశారు. పలు కార్యక్రమంలో పాల్గొని అఖిలప్రియకు ఆమె తోడుగా నిలిచారు. శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com