ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీల హక్కుల కోసం పాటుపడతాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:53 PM

బీసీ వార్డుల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చిందని, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన బీసీలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజలరెడ్డి ప్రకటిం చారు. ప్రొద్దుటూరుస్ధానిక ఆశ్రమం వీధిలోని బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో బీసీ నేతలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సమాఖ్య అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునే సంప్రదాయానికి వరదరాజులరెడ్డి స్వస్తి చెప్పాలన్నారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడాలన్నారు. బీసీ భవన్‌ ఏర్పాటుకు త్వరితగతిన స్ధల పరిశీలన చేయాలన్నారు. బీసీలపై దాడులు జరుగకుం డా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ మీలో ఒక్కడిగానే మెలుగుతూ, మీ కష్టాల్లో బాగం అవుతానన్నారు. కార్యక్రమంలో బీసీ సమాఖ్య నేతలు సంటెన్న వేల్పుల భాస్కర్‌, బత్తల శ్రీనివాసులు గిద్దలూరు మల్లికార్జున హరినారాయణ, ఆరెకటిక భాస్కర్‌రావు, కొత్తపల్లె శీను నల్లబోతల నాగరాజు అంకాల్‌ కొండయ్య ,గజ్జెల చంద్రమౌళి జీసీ పుల్లయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com