ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం?.. అసలు సంగతి ఇది, ఆ వీడియోతో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 09:28 PM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరిగింది. ఆయన నిద్రమాత్రలు మింగేశారని.. ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారంటూ.. కొందరు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు, ట్వీట్‌లు చేశారు. ఈ విషయం తెలియడంతో స్వయంగా మాజీ ఎమ్మెల్యేనే స్పందించారు.. తాను చిన్నపాటి ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరి.. ఓ రెండు గంటల తర్వాత డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇంతలోనే ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని.. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.


'నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించాను.. కార్యకర్తలతో మాట్లాడాను. ఆ తర్వాత కుటుంబంతో కలిసి సరదాగా బయటకు డిన్నర్‌కు వెళ్లాను. రాత్రి నుంచి కొంచెం కడుపులో ఇబ్బందిగా అనిపించింది.. గ్యాస్ట్రిక్, ఫుడ్ పాయిజన్ కారణంగా.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరాను. పొద్దున ఆరు గంటలకు డిశ్చార్జ్ అయ్యాను.. ఏదేదో జరిగిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అవన్నీ అవాస్తవం' అని అదీప్‌రాజ్ క్లారిటీ ఇచ్చారు.


'నేను క్షేమంగా ఉన్నాను.. ఇంట్లోనే హ్యాపీగా, రిలాక్స్‌గా ఉన్నాను. మా బాబును స్కూల్లో కూడా జాయిన్ చేశాను.. హ్యాపీగా ఉన్నాను.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నా. ప్రజల ఆశీస్సులతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం.. షెడ్యూల ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. రేపు, ఎల్లుండి నుంచి అందరికీ అందుబాటులో ఉంటాను.. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. ఓడిపోయామనే బాధలో ఉన్నామని.. కావాలని ఇంకా ఇలా ప్రచారం చేయడం మంచి పద్దతి కాదు. ఇలాంటి వాటికి భయపడేది లేదు' అన్నారు అదీప్‌రాజ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com