ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగ సంఘాలను నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 11:39 AM

 వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో అష్టకష్టాలు పడిన వారికి టీడీపీ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని, దీనికోసం తొలి కేబినెట్‌ సమావేశంలోనే జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం జేఏసీ చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపైనా, తమ కుటుంబంపైనా, ఉద్యోగ సంఘాలపైనా, వివిధ వర్గాలపైనా వైసీపీ ప్రభుత్వం సాగించిన దౌర్జన్యకాండ పై మండిపడ్డారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఆర్థిక చెల్లింపులు సక్రమంగా జరగటం లేదని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, జీపీఎఫ్‌, సీపీఎస్‌ సొమ్మును వాడుకున్నారని గవర్నర్‌కు 2023, జనవరి 19న నివేదించామని, ఆ తెల్లవారు నుంచే వైసీపీ ప్రభుత్వం తనతో పాటు ఉద్యోగ సంఘాలను ఊచకోత కోయటం ప్రారంభించిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీఎన్‌జీవో సంఘాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురద చల్లారని, చివరికి అరెస్టు చేయించేందుకు, చంపించేందుకు కూడా కుట్రలు చేశారని పేర్కొన్నారు. తనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులు పెట్టడం, కుదరకపోవటంతో వాణిజ్యపన్నుల శాఖలో జరిగిన అక్రమ బదిలీలను ప్రశ్నించినందుకు 2021లో జరిగిన ఓ ఉదంతాన్ని ఆధారంగా చూపి అరెస్టు చేయాలని చూసిందన్నారు. ‘ఎఫ్‌ఐఆర్‌ పెట్టి ఆరెస్టు చేయాలని చూశారు. నా భార్య, కూతుళ్లను అర్ధరాత్రి వరకూ విచారణ చేసి హింసించారు. నా భార్య మెడలోని నల్లపూసలను కూడా తీయించారు. భయభ్రాంతులకు గురిచేశారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గవర్నర్‌ను కలిసిన వెంటనే తన ఫోన్లను పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ట్యాప్‌ చేయించారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com