ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లానేతలతో సమీక్ష నిర్వహించనున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 04:59 PM

కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్.. రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరారు. పులివెందులలోనే 5 రోజులు ఉండనున్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, సొంతగడ్డ పులివెందులలోనూ ఎన్నడూ లేని విధంగా భారీస్థాయిలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై సమీక్షలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి సీట్లు వస్తాయనుకుంటే అన్ని జిల్లాల్లోనూ ఓటమి ఎదురైంది. దీనిపైనా జిల్లాల నేతలతో జగన్ సమీక్ష జరుపుతారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com