ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కక్షసాధింపుతో వైయ‌స్ఆర్‌సీపీ భవనాన్ని కూల్చారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 04:40 PM

తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్నవైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన శనివారం ఉదయం కూల్చివేత స్థలాన్ని సందర్శించారు. సీతానగరం భవన ప్రాంతాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హ‌నుమంత‌రావు త‌దిత‌రులు పరిశీలించారు. అనంత‌రం మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు  మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో  నేలమట్టం చేశారు.  ఇది వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీసు నిర్మాణం కోసం నిర్మించాం. కేబినెట్‌ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామ‌ని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా పార్టీ ఆఫీసు కోసం స్థలం కేటాయించింది. కక్ష సాధింపుతో కూల్చివేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైన పరిపాలన చేస్తున్న చం‍ద్రబాబు మాటలేవి?. కక్షసాధింపుతో వైయ‌స్ఆర్‌సీపీ భవనాన్ని కూల్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కూల్చివేత చట్టబద్ధంగా జరగలేద‌ని అంబటి రాంబాబు అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com