ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్‌ జిల్లాలో ఐటీఐలలో ప్రవేశాలకు ఈనెల 20నుండి కౌన్సెలింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 03:53 PM

2024-25 విద్యాసంవత్సరానికిగాను ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్‌ 20 నుంచి జూన్‌ 22వరకు మెరిట్‌ నెంబర్‌ ప్రకారం ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపల్‌, జిల్లా కన్వీనర్‌ ఎం.కనకారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్‌ పొందిన ఎస్సీ, ఎస్టీ మినహా మిగిలిన కేటగిరి అభ్యర్థులు రూ.60 డిపాజిట్‌, ప్రైవేట్‌ ఐటీఐలో చేరగోరే అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 20 ఉదయం 8.00గంటల నుంచి 2 గంటల వరకు మెరిట్‌ నెంబర్‌ 1 నుంచి 162 వరకు, గ్రేడ్‌ 6.8నుంచి 10 వరకు గల అభ్యర్థులకు, మధ్యాహ్నం 2.00గంటల నుంచి నెంబర్‌ 163 నుంచి 333 వరకు, గ్రేడ్‌ 5.5నుంచి 6.7వరకు గల అభ్యర్థులకు, జూన్‌21 తేదీన ఉదయం 8.00గంటలనుంచి 2.00 గంటల వరకు నెంబర్‌ 334 నుంచి 486 వరకు, గ్రేడ్‌ 4.4నుంచి 5.4వరకు గల అభ్యర్ధులు, మధ్యాహ్నం 2.00గంటల నుంచి నెంబర్‌ 487 నుంచి 646 వరకు, గ్రేడ్‌ 4.3నుంచి దిగువ గ్రేడ్‌ వరకు గల అభ్యర్థులు, జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు జూన్‌22 తేదీన ఉదయం 8.00గంటల నుంచి 2.00 గంటల వరకు నెంబర్‌ 1 నుంచి 333 వరకు, గ్రేడ్‌ 5.5నుంచి 10వరకు గల అభ్యర్ధులు, మధ్యాహ్నం 2.00గంటలకు నెంబర్‌ 334 నుంచి 664 వరకు, గ్రేడ్‌ పాయింట్‌ 5.4నుంచి దిగువ గ్రేడ్‌ వరకు గల అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు. అభ్యర్ధులు 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కులధృవీకరణ పత్రం, ఈడబ్ల్యుఎస్‌ పత్రం, ఆధార కార్డు, స్టడి అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో హాజరు కావలన్నారు. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేయించుకున్న వారు సంబంధిత ధ్రువీకరణ పత్రంతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com