అనంతపురం జిల్లా, నల్లమాడ మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాలను, కస్తూరిబా పాఠశాలను డీఈఓ మీనాక్షి గురువారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. కస్తూరిబా పాఠశాలలో ఉపాధ్యాయినులపై విధులు సక్రమంగా నిర్వహించలేదని ఆరోపణలు ఉండడంతో మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినులకు చదువుచెప్పడంలో కానీ, భోజన మెనూలో కానీ పొరపాట్లు చేస్తే కఠనంగా వ్యవహరిస్తామని అన్నారు. అనంతరం జిల్లాపరిషత ఉన్నత పాఠశాలను పరిశీలించి, ఆవరణలో మొక్కలు నాట్టారు. ఆమె వెంట ఎంఈఓలు వేమనారాయణ, సురేష్, ఉపాధ్యాయులు ఉన్నారు.