ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపకులు తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద టీడీపీ, జనేసన, బీజేపీ ఉమ్మడిగా ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకొని అఖండ మెజారిటీతో విజయాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రిగా కొణిదల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గురువారం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తదనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా యూని వర్శిటీ అధ్యాపకులు ఆచార్య వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వికాస నాయకులు టంకసాల వెంకటేశ్వరరావు, తోట వెంకటేష్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, టి.ఎన్.టి.యు.సి నాయకుడు డా.ఎం.వెంకటరమణ, ప్రెసిడెంట్ వి.విష్ణుప్రసాద్, ఎల్.రాంబాబు, యన్. నాగేశ్వరరావు, బీజేఎం నాయకులు యన్. శ్రీనివాసరావు. పిల్లి నాగేశ్వరరావు యూనివర్శిటీ ఉద్యోగులు, టి.రఘు, నాగరాజు, ప్రసాద్, యన్. కోటేశ్వరరావు, ఆర్.ఆనంద్ కిషోర్, యన్.సాంబయ్య, కె.కనకరాజు, యన్. రమేష్, యం.వి.ఎస్ ప్రభాకర్, సురేంద్రరెడ్డి, టి.సుధాకర్, యన్. సుజన్, ఎ. శివ, రాజేంద్ర, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.