ఏలూరు జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రత్న ప్రసాద్, పర్మినెంట్ లోక్ అదాలత్ చైౖర్పర్సన్ ఎ.మేరీ గ్రేస్కుమారి అన్నారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవ రణలో లోక్ అదాలత్ భవనంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈనెల 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు లావాదేవిల కేసులు, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, ట్రాన్స్ఫోర్టు ఫైనాన్స్కు సంబంధించిన ఈపీలను, ప్రిలిటికేషన్ కేసులను ఈ లోక్అదాలత్లో రాజీ చేస్తా రన్నారు. రాజీయోగ్యమైన కేసులకు సంబంధించి ఇరువైపులా వారికి ఏలూరులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలోని పర్మినెంట్ లోక్అదాలత్లో పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరిస్తారని వివరించారు. ఇతర ప్రాంతాల్లో నివసించే వారితో ఆన్లైన్లో చర్చించి కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.