ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా,పెదవేగి మండలంలో గాలివాన బీభత్సంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం సాయంత్రం మబ్బులు కమ్మి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి, ప్రజలు అవస్థలు పడ్డారు. ఏలూరు – చింతలపూడి ప్రధాన రహదారిపై జానంపేట దగ్గర రహదారిపై భారీవృక్షం కూలడంతో రాకపోకలు స్థంభించి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భారీవృక్షాన్ని తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.